హత్యయత్నానికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేయాలి

0

హత్యకు ప్లాన్ చేసిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలి

. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్

కొత్తూరు:
హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ను షాద్ నగర్ నియోజకవర్గం లోని కొత్తూరు పట్టణంలో బుధవారం హత్య చేసేందుకు కుట్ర జరిగిందని, ఈ హత్యకు ప్లాన్ చేసిన నిందితులను వెంటనే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్ రావు పై హత్యాయత్నానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కొత్తూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జమ్మికుంట కౌన్సిలర్లను మల్లయ్య తీసుకువచ్చి ఒక రిసార్ట్ లో పెట్టి, వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చిన చైర్మన్ పై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. రిసార్ట్ లో ఉన్న కొంతమంది కౌన్సిలర్లు తమను నిర్బంధించారని చెప్పడంతో వారిని వెతుకుంటి వచ్చిన వారిపై చంపే ప్రయత్నం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రజా పాలన చేస్తామంటూ మరోవైపు హత్య రాజకీయాలకు తెరతీస్తున్నదన్నారు. హత్య యత్నానికి పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకొని శిక్షించాలని లేనియెడల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భారీ ఆందోళన దిగుతామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *