ఘోర రోడ్డు ప్రమాదం..
![](https://navatelanganabapurao.com/wp-content/uploads/2023/12/IMG-20231222-WA0631-1024x770.jpg)
పెంచికలపేట స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..
. లారీ, కారు ఢీ..నలుగురు మృతి
. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
ఎల్కతుర్తి:
ఎల్కతుర్తి మండలం పెంచికలపేట స్టేజి వద్ద కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏటూరునాగారం లోని ఒకే కుటుంబానికి చెందిన వారు వేములవాడ రాజన్న దర్శనానికి కారులో వెళ్తున్నారు. కాగా శుక్రవారం తెల్లవారుజామున ఎలుకతుర్తి మండలం పెంచికలపేట స్టేజి వద్ద కారు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ములుగు జిల్లా ఎటురునాగారంకు చెందిన మంతెన కాంతయ్య (72), మంతెన శంకర్ (60), మంతెన భరత్ (29), మంతెన చందన (16) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించారు.