అమెరికాలో హుజురాబాద్ యువకుడు మృతి

2

అమెరికాలో హుజురాబాద్ యువకుడు మృతి
. ఉన్నత చదువులకు వెళ్లి విగత జీవుడిగా మారి..
. హుజురాబాద్ లో విషాద చేయాలి
హుజూరాబాద్:
అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫినిక్స్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హుజురాబాద్ కు చెందిన వైయువకుడు ముక్క నివేష్ (20) మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హుజరాబాద్ పట్టణానికి చెందిన వైద్యులు ముక్క నవీన్, స్వాతి దంపతులకు నివేష్, సందేష్ లు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ముక్క నివేష్ గత సంవత్సరం జనవరిలో ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చేయడానికి అమెరికా ఆరిజోనా రాష్ట్రంలోని యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం నివేశ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ రోజు కళాశాలకు సెలవు కావడంతో నలుగురు స్నేహితులు కలసి వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లారు. తిరిగి కారులో వస్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీ కొట్టడంతో ముక్క నివేష్ తో పాటుగా తన సహచర విద్యార్థి హన్మకొండకు చెందిన గౌతమ్ సైతం మృతి చెందినట్లు నివేష్ తల్లిదండ్రులు డాక్టర్ నవీన్, డాక్టర్ స్వాతిలు తెలిపారు. కాగా ఈ సంఘటనపై అరిజోనా పోలీసులు సమాచారం అందించడంతో పాటు అక్కడి పోలీసులు 00026879/2024 ద్వారా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
. ముక్క కృష్ణమూర్తి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు..
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ వైద్యులు ముక్క కృష్ణమూర్తి మనువడు, ముక్క నవీన్, స్వాతిల కుమారుడు నివేష్ మృతి చెందిన విషయం తెలియగానే మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఎం సుదీర్ కుమార్ తదితరులు వారి ఇంటికి వెళ్లి సంతాపం తెలిపారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. అలాగే మృతదేహం త్వరగా వచ్చేందుకు అవసరమైన సహయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

2 thoughts on “అమెరికాలో హుజురాబాద్ యువకుడు మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *