రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం
హుస్నాబాద్:
రాష్ట్ర ప్రజలకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడారు. 2024లో ఆరు గ్యారెంటీలను అమల్లోకి తీసుకువస్తామన్నారు. పథకాలకు సంబంధించి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. 2023లో ప్రజలు మార్పు కోరుకున్న ప్రభుత్వం వచ్చిందని.. 2024లో ప్రజలు కోరుకుంటున్నా పరిపాలనను అందిస్తామన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలను అందజేస్తామన్నారు.
పూలు కాకుండా జ్ఞానం ఇచ్చే పుస్తకాలు ఇవ్వండి…
నూతనసంవత్సరం సందర్భంగా అభినందనలు తెలియజేయడానికి వస్తున్న అధికారులు, ఆత్మీయులందరూ ఒక రోజులో వాడిపోయే పూలు..జారిపోయే శాలువాలు కాకుండా, రేపటి తరానికి వెలుగును పంచే జ్ఞాన జ్యోతులైన పుస్తకాలు, నోట్ బుక్స్ లాంటివి తీసుకు వస్తే నేను సంతోషిస్తానని తెలిపారు.