ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
ప్రజాపాలన దరఖాస్తుల నమోదులో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్:
ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తుల నమోదు సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని రాంనగర్ 37వ డివిజన్ లో నిర్వహించిన ప్రజాపాలన అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీ కార్యక్రమం ద్వారా దరఖాస్తులను సమర్పించడానికి వచ్చే ప్రజలకు దరఖాస్తు నమోదులో అవగాహన కల్పించడంతో పాటు సహకారాన్ని అందించాలన్నారు. కేంద్రాల వద్ద వృద్ధులు, మహిళల కొరకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని, కూర్చీలు ఇతర మౌలిక వసతులను కల్పించాలని తెలిపారు. కేంద్రాలకు వచ్చి సమర్పించే ప్రతి దరఖాస్తును తీసుకోవాలని, దరఖాస్తులను తిరస్కరించడానికి వీలు లేదని ఆమె పేర్కోన్నారు. కేంద్రానికి వచ్చిన మహిళలతో దరఖాస్తుల పంపిణీ, నమోదు మరియు వారి సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.