ప్రజా పాలనను సద్వినియోగం చేసుకోవాలి
ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
. అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్
కరీంనగర్:
ప్రజల సంక్షేమం, అభివృద్ధి, మెరుగైన ప్రజా పాలనను అందించడం కోసం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ సూచించారు. గురువారం కరీంనగర్ పట్టణంలోని భగత్ నగర్, గోదాం గడ్డ, ఆరేపల్లి, మల్కాపూర్ ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియం చేసుకోవాలని ఆయన తెలిపారు. రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. దరఖాస్తు ఫారాలను తప్పులు లేకుండా నింపి అధికారులకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, నగరపాలక సంస్థ కమిషనర్
శ్రీనివాస్, కార్పొరేటర్ తోటరాములు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.