కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రణవ్ ను ఆశీర్వదించండి
![](https://navatelanganabapurao.com/wp-content/uploads/2023/11/nava-telangana-bapurao-bless-congress-party-candidate-pranav.jpeg)
- హుజురాబాద్ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించండి
- కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రణవ్ తల్లి పద్మశ్రీ
హుజూరాబాద్ :
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ ను ఆదరించి ఆశీర్వదించి హుజురాబాద్ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని ప్రణవ్ తల్లి వొడితల పద్మశ్రీ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో ఆమె ఎన్నికల ప్రచారాన్ని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని తెలిపారు. మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేస్తుందని, మహిళలకు నెలకు రూ.2500లు అందించేందుకు కార్యచరణ రూపొందించినట్లు తెలిపారు. అలాగే మహిళలకు అర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం, రూ.5లక్షలు అందించానున్నామని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మా కుటుంబ ఎంతగానో కృషి చేస్తుందని, ఆ విషయం హుజూరాబాద్ ప్రజలు తెలుసునని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళ అధ్యక్షురాలు యేముల పుష్పలత, పట్టణ అధ్యక్షులు సొల్లు బాబు, ఆలేటి సుశీల, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు అఫ్సర్, ఎర్ర రవీందర్, మంద బిక్షపతి, కుర్ర శ్రీనివాస్ గౌడ్, తిరుపతి, రియాజ్, నునిత, విష్ణు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.