ఇంటింటికీ అయోధ్య రాముడి ఫొటోల పంపిణీ
ఎల్కతుర్తి:
ఎల్కతుర్తి మండలంలోని చింతలపల్లి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు కుడుతాడి చిరంజీవి అధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకులు అయోధ్య శ్రీరాముడి ఫొటోలు పంపిణీ చేశారు. మంగళవారం గ్రామంలో ఇంటింటికీ తిరిగి నేతలు ఫొటోలు అందజేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్పం పించిన అయోధ్య శ్రీరాముడి ఫొటోలను ఇంటింటికీ తిరిగి అందజేసినట్టు నాయకులు చిరంజీవి వెల్లడించారు. కార్యక్రమంలో కరుణాకర్, రాజు, సారంగం తదితరులు పాల్గొన్నారు.