చదువుతోనే సమాజంలో మార్పు
- యప్ టీవీ సీఈవో పాడి ఉదయ్ నందన్ రెడ్డి
హుజురాబాద్:
చదువు ద్వారానే సమాజంలో మంచి మార్పు వస్తుందని యప్ టీవీ సీఈవో పాడి ఉదయ్ నందన్ రెడ్డి అన్నారు. వీణవంక గ్రామంలో 220 అనాథ మరియు నిరుపేద విద్యార్థులకు పాడి ఉదయ్ నందన్ రెడ్డి నెలకి వెయ్యి చొప్పున ఆర్థిక సాయం అందించే దానిలో భాగంగా రెండు నెలల స్కాలర్షిప్లను తన సిబ్బంది ద్వారా మొత్తం 4,40,000/- రూపాయల స్కాలర్షిప్ లను విద్యార్థులకు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు.
విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం మంచి నాణ్యమైన విద్యను వీణవంక గ్రామంలోని విద్యార్థులకి అందించాలని గొప్ప లక్ష్యంతో ప్రతినెల విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తున్నారు.ఈ కార్యక్రమంలో స్కాలర్షిప్స్ విభాగం వీణవంక మండల్ బ్రైట్ లైఫ్ కో-ఆర్డినేటర్ తాళ్లపెళ్లి కుమారస్వామి పాల్గొన్నారు.