మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా ఏబూసి శ్రీనివాస్
- నియామక పత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షులు
కరీంనగర్:
తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన సీనియర్ రిపోర్టర్ ఏ బూసి శ్రీనివాస్ ను ఇటీవల హైదరాబాదులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నియమించారు. కరీంనగర్ లో ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు జర్నలిస్టుల సమావేశం జిల్లా అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ విచ్చేసి నియామక పత్రాన్ని ఏ బూసి శ్రీనివాస్ కు అందజేశారు.
ఎన్జీవో ఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు విట్టల్, మున్నూరు కాపు ఉద్యోగస్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాల శ్రీనివాస్ లు, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బండి పద్మ శాలువాతో రాష్ట్ర కార్యదర్శిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏ బూసి శ్రీనివాస్ మాట్లాడారు.
తన నియామకానికి అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ కు ,జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వేల్పుల శ్రీనివాస్, వెంకటరమణ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్నూరు కాపు జర్నలిస్టుల ఐక్యతకు, సమస్యల పరిష్కారం కొరకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు రాజు, శరత్, జగిత్యాల జిల్లా రమేష్,చందు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.