పుస్తక పఠనాన్ని ప్రతీ ఒక్కరు అలవర్చుకోవాలి
- బీసీ, రవాణా శాఖ మంత్రి ప్రభాకర్
- హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగింపు సభకు ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం
హైదరాబాద్:
పుస్తక పఠనాన్ని ప్రతీ ఒక్కరు అలవర్చుకోవాలని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 36 వ జాతీయ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగింపు సభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై బుక్ ఫెయిర్ లోని పలు బుక్ స్టాల్ లను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ పుస్తకం తన దృష్టిలో మానవుడి మేధ సంపతి కి నావిగడ్డ లా పని చేస్తుందని చెప్పారు. భవిష్యత్ లో దిశా నిర్దేశం చేసేది పుస్తకం పఠనం అని పేర్కొన్నారు.
బుక్ ఫెయిర్ లో 400 పైన బుక్ స్టాల్స్ ఉన్నాయని, సామజిక, సాంస్కృతిక, రాజకీయ సాంఘిక, రంగాలకు సంబంధించిన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయని వెల్లడించారు. మనిషి నిగూడమైన జ్ఞానాన్ని దిశను ఇచ్చే విధంగా పుస్తకాలు పని చేస్తాయని స్పష్టం చేశారు. వచ్చే పుస్తక ప్రదర్శనలో సౌకర్యాలు మరింత మెరుగు పడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 36 సార్లు ఈ పుస్తక ప్రదర్శన జరిగిందని వివరించారు.
పుస్తకం పఠనం బతకాలంటే తల్లిదండ్రులు పిల్లలకు పుస్తకం పఠనం అలవాటు చేయాలని సూచించారు.
పుస్తకం పఠనం నిరంతరం తరగని ఆస్తి అని పేర్కొన్నారు. బుక్ ఫెయిర్ ప్రాంగణానికి విప్లవ కవి గద్దర్ అన్న పేరు పెట్టుకోవడం మంచి పరిణామం అని తెలిపారు. సమాజం లో ప్రతీ అంశంపై అవగాహన రావాలంటే కవులు మరింత ముందుకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు.