వద్దిరాజు రవిచంద్ర పరామర్శ
హైదరాబాద్:
స్వల్ప అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఆర్టీసీ మాజీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పరామర్శించారు. గోవర్ధన్ అస్వస్థతకు గురైనట్టు సమాచారం తెలిసిన వెంటనే ఎంపీ రవిచంద్ర శుక్రవారం నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. గోవర్ధన్ వెంటనే కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని రవిచంద్ర ఆకాంక్షించారు.