అభివృద్ధి పనుల పరిశీలన
అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
. పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి
పరకాల:
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచించారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట్, సంగెం మండలం చింతలపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ను శనివారం పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి సందర్శించారు. యూనిట్ల వారిగా అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును అధికారులు పరిశ్రమల నిర్వాహకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులను పరిశ్రమ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆర్పాటంగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణానికి భూమి పూజ చేసి ఏడేళ్లు గడిచిన పనులు మాత్రం నత్తనడకగా సాగాయని, గత పాలకులు అక్రమ సంపాదనపై ఉన్న శ్రద్ధ టెక్స్టైల్ పార్క్ అభివృద్ధిపై చూపకపోవడంతో ఎంఓయు చేసుకున్న కంపెనీలు సైతం పనులు పూర్తి చేయలేకపోయాయన్నారు. ఎంఓయు చేసుకున్న కంపెనీలు తమ యూనిట్ల నిర్మాణ పనులు వేగవంతం చేసి ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించాలన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నట్లు వారు నా దృష్టికి తీసుకుని వచ్చారని ఉద్యోగ భద్రతతో పాటు తగిన వసతులు ఏర్పాటు చేయాలన్నారు. వారి పని ఒత్తిడిని తగ్గించెలా యజమాన్యం చర్యలు చేపట్టాలని కంపెనీ నిర్వాహకులను కోరారు.